- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వీరంతా ఖతర్లో నివసిస్తున్న వారని, కెన్యా పర్యటనకు వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించిందని ఖతార్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది. ఖతార్లో నివసిస్తున్న 28 మంది ప్రవాస భారతీయుల బృందం కెన్యాకు విహారయాత్రకు వెళ్లింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భారతీయులు మరణించినట్లు తమకు సమాచారం అందిందని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
- Advertisement -