Sunday, June 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మృతి

ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇజ్రాయిల్‌ శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్‌ అధ్యక్షుడు మరణించినట్లు ఇరాన్‌ మీడియా స్పష్టం చేసింది. జనరల్‌ హుస్సేన్‌ సలామి దేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కేంద్రాలలో ఒకదానికి అధ్యక్షత వహిస్తున్నారు. 2019లో సలామీని ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీఖమేనీ రివల్యూషనరీ గార్డ్ అధ్యక్షునిగా నియమించారు. అమెరికా, ఇజ్రాయిల్‌లకు బెదిరింపులు కూడా జారీ చేశారు.

1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ని ప్రారంభించారు. అప్పటి నుండి పరిమిత కాలంలోనే పారామిలటరీ, దేశీయ భద్రతాదళం నుండి సిరియా మరియు లెబనాన్‌ నుండి ఇరాన్‌ వరకు మధ్యప్రాచ్యంలోని ఇరాన్‌ మిత్ర దేశాలకు సహాయం అందించే అంతర్జాతీయ శక్తి పరిణామం చెందింది. ఇది దేశంలోని ప్రస్తుత సాయుధ దళాలతో పాటుగా పనిచేస్తోంది. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల ఆయుధాగారాన్ని నియంత్రిస్తోంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ ఈ గార్డ్‌ సాయంతో ఇజ్రాయిల్‌పై రెండు సార్లు దాడులు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -