నవతెలంగాణ – నవాబు పేట
నవపేట్ మండలంలోని నవపేట్, రేకుల చౌడపూర్ గ్రామాలకి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ డిసిసి అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రయ్య, యువజన అధ్యక్షులు నీలకంఠం,శంకర్ నాయక్, ఆనంద్, కొల్లి నరసింహులు, చిర్ప సత్యం,ఎరుకల రాము, వెంకటేష్, సంతోష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES