- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్పథ్ రోడ్డులో ఉన్న సీసీఎస్ భవనంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. దాదాపు 13 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు.
- Advertisement -