దాదాపు 98% కంటే ఎక్కువ రుణాలు 24 గంటల్లోపు పంపిణీ చేయబడ్డాయి
కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో రుణ దరఖాస్తు చేసుకోవచ్చు
నవతెలంగాణ హైదరాబాద్: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక సంవత్సరం 2025లో తమ కస్టమర్లకు సాంప్రదాయ పాలసీలపై రుణాలుగా రూ. 900 కోట్లకు పైగా పంపిణీ చేసింది. పాలసీపై రుణం తీసుకోవటం పాలసీ దారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది వినియోగదారులకు తమ దీర్ఘకాలిక పొదుపు ప్రణాళికకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా లిక్విడిటీని అందిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025లో, కంపెనీ 42,700 మందికి పైగా కస్టమర్లకు రుణాలను పంపిణీ చేసింది.
“జీవిత బీమా అనేది దీర్ఘకాలిక ఉత్పత్తి, పాలసీ వ్యవధిలో వినియోగదారులు నగదు పరంగా సవాళ్లను ఎదుర్కోవచ్చు. పాలసీపై రుణం తీసుకునే అవకాశం వారి ఆర్థిక పొదుపు ప్రణాళికను క్రమ పద్దతిలో ఉంచుతుంది. ముఖ్యంగా, కస్టమర్లు పాలసీ సరెండర్ విలువలో 80% వరకు రుణాన్ని పొందవచ్చు అని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్,అమిష్ బ్యాంకర్ అన్నారు.
పాలసీపై రుణం పొందే ప్రక్రియ కాగిత రహితంగా మరియు వేగంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2025లో, 98% కంటే ఎక్కువ రుణాలు 24 గంటల్లోపు పంపిణీ చేయబడ్డాయి. కస్టమర్లు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి కంపెనీ వెబ్సైట్ లేదా మా మొబైల్ యాప్ను ఉపయోగించవచ్చు.
2025 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ పరంగా గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 60% పెరుగుదలతో మా కస్టమర్లు పాలసీపై రుణం ఫీచర్ను ఎక్కువగా స్వీకరించడాన్ని మేము చూశాము. ఇది దీర్ఘకాలికంగా ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి , ఉత్పత్తిని కొనుగోలు చేసిన తరువాత ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మా కస్టమర్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పాలసీ ప్రీమియంలను కూడా ఈ రుణాల ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండటం వల్ల పాలసీ, దాని ప్రయోజనాలు నిరంతరం కొనసాగుతాయి.