ఎస్ మల్లారెడ్డి.. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఫ్రీ పై మరి తరగతులు ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో టి ఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా కమిటీ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పస్రా నాగారంలో టీఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షులు పోడెం సమ్మయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి యస్ మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, పెండింగ్ బిల్లు విడుదల చేయాలని, హెల్త్ స్కీముని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పనిచేస్తున్న పండిట్, పి ఈ టి పోస్టులను అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వాలని, వసతి గృహాలను ఆశ్రమ పాఠశాల గా మార్చిన ఆయా పాఠశాలకు పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వాసుదేవ రెడ్డి, కోశాధికారి ములుకాల వెంకటస్వామి, కుటుంబ సంక్షేమ నిది కన్వీనర్ కొండ చెంచయ్య, జిల్లా కార్యదర్శులు కే రఘురాం, కే శివరాం ఉపాధ్యాయులు జి పురుషోత్తం, పి ప్రసాద్, జి శ్రీనివాస్, పి. సమ్మయ్య, సురేందర్,దశ్రు తదితరులు పాల్గొన్నారు
అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES