మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా..
నవతెలంగాణ – పాల్వంచ : 2025 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ వారు మైనార్టీ విద్యార్థుల కొరకు సీఎం ఓవర్ సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ సింగపూర్, న్యూజిలాండ్, జపాన్, ప్రాన్స్, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇంజనీరింగ్ లో పీజీ, పీహెచ్.డీ చేయుటకు 2 సంవత్సరాలకు గాను 20 లక్షల రూపాయల ఉచిత ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ చార్జీల కోసం అదనంగా 60 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, ఈ ఉపకార వేతనం పొందుటకు గాను విద్యార్థి కుటుంబ సంవత్సర ఆదాయం ఐదు లక్షల లోపు పొందినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు బీటెక్, ఎం టెక్ లలో 60 శాతం మార్కులు పొంది జీఆర్ఈ, జీఎంఏటీలలో తత్సమానమైన అర్హత పొందటం టోఫెల్/ఐఈల్ టీఎస్ స్కోర్ కార్డ్ కలిగి యూనివర్సిటీలలో జనవరి 1, 2025 నుండి 30 జూన్, 2025 లోపు అడ్మిషన్ పొందిన వారు తమ కాలేజీ అడ్మిషన్ లెటర్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ కాఫీ, నివాసధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం, బీటెక్ మార్కుల జాబితాతో www.telanganaepass.cgg.gov.in అనే వెబ్ సైట్ నందు ఈ జూన్ 30తేదీ వరకు ఆన్ లైన్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ చేసిన హార్డ్ కాపీలను సంబంధిత పత్రాలను జతచేసి నిర్ణిత గడువులోగా ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు,జైన్, పార్సి, బౌద్ధ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు 8520860785 అనే నెంబర్ కు సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు.
విదేశీ ఉపకార వేతనాలను మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES