– ఏడుగురికి తీవ్ర గాయాలు-జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం
– వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో ప్రమాదం
నవతెలంగాణ – కోరుట్ల
కరెంట్ షాక్తో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ విగ్రహాలను మరో చోటుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో 33 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కరెంట్ షాక్ తగిలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అల్వాల వినోద్, అల్వాల నితిన్, వెంకట్రెడ్డి, రాజేష్, నెల్లుట్ల బంట, నెల్లుట్ల కృష్ణ సాయినాథ్, హనుమంతు, ఆకాష్, రోషన్ గాయపడ్డారు. వారిని కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి బాలాజీ విగ్రహాల తయారీ కేంద్రం యజమాని అల్వాల వినోద్, కార్మికుడు సాయి చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES