Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్‌ఎల్‌డీ కృషి

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్‌ఎల్‌డీ కృషి

- Advertisement -

రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు విఫలం :కేంద్ర మంత్రి జయంతి చౌదరి
నవతెలంగాణ – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) కృషి చేస్తుందని కేంద్ర మంత్రి జయంతి చౌదరి అన్నారు. ఆదివారం కవాడిగూడలో టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జయంతి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2012 – 2014 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ కీలకపాత్రతో పాటు, తాను కూడా నేరుగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలో పేతం చేయాల్సిన ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు విఫలమ య్యాయని విమ ర్శించారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళాధ్యక్షురాలు కె.ఇందిరా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కిన్నెర సిద్ధార్థ్‌, గిరి కుండే, విశాల్‌ వంజారి, మల్లేశ్‌ గౌడ్‌, ఋషట్‌ జైన్‌, ఓంకార్‌ గౌడ్‌, మడకం ప్రసాద్‌, నునే భాస్కర్‌రావు, నరసింహారావు, కోరె సాయిరామ్‌, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్‌ అధ్యక్షులు టైగ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బీరప్ప, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -