Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ యంత్రాంగం..

గ్రామ సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ యంత్రాంగం..

- Advertisement -

కల్వకుంట్ల గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలి..
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.. 
నవతెలంగాణ – మునుగోడు
: గ్రామంలో గత కొన్ని నెలలుగా  అనేక సమస్యలు పరిష్కరించకుండా పేరుకుపోయాయని తక్షణమే అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామానికి వచ్చే మార్గంలో ప్రధాన రహదారి వెంట కల్వకుంట్ల  దగ్గర రోడ్డు గుంతలుగా మారిందని, చాలా రోజుల నుంచి అలాగే ఉంటుందని గతంలో కూడా పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్యదర్శికి , మండల అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన కూడా తమకేమీ పట్టదు అన్నట్టుగా సమస్యలను గాలికి వదిలేసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా లేవని వర్షాకాలం సమీపించింది కనుక లార్వా మరియు దోమలు అభివృద్ధి చెందకుండా, ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో ప్రతిరోజు పరిశుభ్రతను పాటించే విధంగా ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కోరారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేక అనేక సంవత్సరాల నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి, మండల, జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి బస్సు సౌకర్యం సాధించేవరకు పార్టీ , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. గ్రామాలలో అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు పథకాలు అందే విధంగా చూడాలని, ఎలాంటి సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించే విధంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు ప్రజలకు అనుకూలంగా పనులు చేయాలని కోరారు. గ్రామాలలో అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ఇప్పటివరకు వచ్చిన జాబితాలో అర్హులయే ఉన్నాయని, మరి కొంతమంది అర్హులు కూడా గ్రామంలో ఉన్నారని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారంగా గత 40 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతుందని, గ్రామ అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా సీపీఐ(ఎం) కల్వకుంట్ల గ్రామంలో పనిచేస్తుందని తెలియజేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు ఆదరించి మరింత గ్రామ అభివృద్ధికి సీపీఐ(ఎం) సేవలు ఉండే విధంగా ప్రజలు అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, సీనియర్ నాయకులు నారబోయిన నరసింహ, బొందు పెద్ద అంజయ్య, సింగపంగా ఎల్లయ్య, జిల్లపల్లి యాదయ్య, అయితగోని యాదయ్య, పులకరం అంజయ్య, జడిగేలా అంజయ్య, సింగపంగా కృష్ణయ్య, గ్రామశాఖ కార్యదర్శి పగిళ్ల మధు, మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, కట్ట లింగస్వామి, పగిళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -