Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విద్య రంగ సమస్యలు పరిష్కరించాలి: యుఎస్ఎఫ్ఐ  

ప్రభుత్వ విద్య రంగ సమస్యలు పరిష్కరించాలి: యుఎస్ఎఫ్ఐ  

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : ప్రభుత్వ విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. 2025 26 విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇంకా ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రకంగా ఉన్నాయని అన్నారు. అదే రకంగా కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు విద్యార్థులకు సరిపడా బెంచీలు, మరుగుదొడ్లు మరియు సరైన ఎలక్ట్రిసిటీ కూడా లేని ప్రభుత్వ విద్యాసంస్థలు అనేకం ఉన్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘం గా పోరాటాలు చేస్తుంటే అరకొర నిధులు కేటాయిస్తూ నానా మాత్రపు పనులు మాత్రమే జరుగుతున్నాయి కానీ పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం సంబంధించి నాణ్యత లోపం ఉందని తెలియజేసినప్పుడు మాత్రమే కొంతమేర ఫలితం ఉంటుందని, తర్వాత యధావిధిగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ప్రభుత్వ విద్యారంగ బోలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు బాబురావు మరియు కమిటీ సభ్యులు సజన్,వరదరాజ్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -