- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పంచాయతీ కార్యదర్శి లింగంపల్లి మురళితో కలిసి పాఠశాల హెచ్ఎం ఎన్.రమేష్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఆర్. కరుణాకర్, రుచిత ఉన్నారు.
- Advertisement -