Wednesday, June 18, 2025
E-PAPER
Homeజిల్లాలుఎమ్మెల్యే యశస్విని రెడ్డి సుడిగాలి పర్యటన 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సుడిగాలి పర్యటన 

- Advertisement -

రూ. 1.12 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 
నవతెలంగాణ – పెద్దవంగర
: పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పెద్దవంగర మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అవుతాపురం, పోచంపల్లి, గంట్లకుంట, కాన్వాయిగూడెం, కొరిపల్లి, వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర, ఉప్పెరగూడెం, పోచారం, బొమ్మకల్, చిట్యాల గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో రూ. 1.12 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి గ్రామంలోనూ త్వరితగతిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. పెద్దవంగర మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుందని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఎల్లవేళలా పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల టిప్పర్ ఢీకొని మృతి చెందిన జాటోత్ ఇందుమతి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ దయాకర్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, మండల నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు, బానోత్ సీతారాం, బానోత్ గోపాల్, ముత్యాల పూర్ణచందర్, దాసరి శ్రీనివాస్, తోటకూరి శ్రీనివాస్, ముత్తినేని శ్రీనివాస్, బొమ్మెరబోయిన రాజు, బీసు హరికృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య, చిలుక దేవేంద్ర, గద్దల ఉప్పలయ్య, వెంకన్న, రవి, ఉపేందర్, నరేష్ సోమేశ్వర్, సంపత్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -