Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐటీఐలో చేర్పించండి..

ఐటీఐలో చేర్పించండి..

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక  : పదో తరగతి పూర్తయిన విద్యార్థుల్ని ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో చేర్పించాలంటూ దుబ్బాక ప్రభుత్వం ఐటీఐ కళాశాల సిబ్బంది ప్రచారాన్ని నిర్వహించారు. ఐటీఐ, ఏటీసీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సత్వర ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం జే.ప్రభుదాస్ ను, మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి, తిమ్మాపూర్, హబ్సిపూర్ జెడ్పీహెచ్ఎస్ ల హెచ్ఎం లు, ఉపాధ్యాయులను కలిసి వివరించారు. అనంతరం వారికి కరపత్రాలను అందజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐటీఐ కళాశాల సిబ్బంది పిరాజి, అనిల్, శివరాజం, పలు గ్రామాల యువకులు సాగర్, అనిల్, బలరాం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -