Wednesday, June 18, 2025
E-PAPER
Homeఖమ్మంతెలియని వ్యక్తులు వస్తే ఆశ్రయం ఆశ్రయం ఇవ్వొద్దు..

తెలియని వ్యక్తులు వస్తే ఆశ్రయం ఆశ్రయం ఇవ్వొద్దు..

- Advertisement -

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
అపరిచితులు మీ గ్రామానికి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ఆశ్రయం ఇవ్వొద్దని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై టి.సురేష్, ఎం.సోమేశ్వర్ ప్రజలకు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఓ.ఎస్.డి నరేందర్ ఆదేశాల మేరకు టేకులపల్లి సీఐ టి.సురేష్ ఆధ్వర్యంలో ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారం, పెద్ద వెంకటాపురం గుత్తి కోయ గ్రామాలలో స్థానిక ఎస్సై ఎం.సోమేశ్వర్ సిబ్బందితో మంగళవారం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుట్ట ప్రాంతంలో వరుస ఎదురు కాల్పులు, అరెస్టులతో కొందరు మావోయిస్టులు రక్షణ కోసం చత్తీస్గడ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తెలంగాణలోని ఆళ్ళపల్లి, గుండాల, కరకగూడెం, ఏడుళ్లబయ్యారం, మణుగూరు, ,అశ్వాపురం అడవుల్లో ఆయా గిరిజన ఆదివాసీ గ్రామాలే ఆధారంగా చేసుకుని ఉంటున్నట్టు తెలుస్తుందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, మావోయిస్టు సానుభూతిపరులు మీ గ్రామానికి లేదా మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అట్టి సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, వారికి తగిన నగదు పారితోషకం ఇస్తామని తెలిపారు. యువత మంచిగా చదివి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కె.ఉపేందర్, స్పెషల్ పార్టీ, టీ.జీ.ఎస్.పీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -