– ఇథియోపియన్ ఎయిర్లైన్స్ వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్
ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయినా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ భారత్లో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఇథియోపియా నుంచి హైదరాబాద్కు నేరుగా ప్యాసింజర్ విమాన సర్వీస్ ప్రారంభించినట్టు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ సీఈఓ మెస్ఫిన్ తస్యూ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మెస్ఫిన్ మీడియాతో మాట్లాడుతూ.. వారానికి మూడుసార్లు నడిచే ఈ విమాన సర్వీసును ఆడిస్ అబాబా బోల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రభుత్వ సీనియర్ అదికారులు, రాయబారులు ప్రారంభించారన్నారు. ఆడిస్ అబాబా నుంచి హైదరాబాద్కు సోమ, బుధ, శనివారాలు, హైదరాబాద్ నుంచి ఆడిస్ అబాబాకు మంగళ, గురు, శనివారాల్లో రాకపోకలు ఉంటాయని వెల్లడించారు. ఇది తమ విమానాలు నేరుగా వెళ్లే ఐదో నగరం కానుందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నరు నగరాలకు తమ ఎయిర్లైన్స్ సేవలు నడుస్తోన్నాయన్నారు.
హైదరాబాద్ నుంచి ఇథియోపియాకు విమానం
- Advertisement -
- Advertisement -