కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగ కార్యదర్శి పార్థ్ పాల్ రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) నిర్మాణం సీపీడబ్ల్యూడీ చేత నిర్వహించ బడుతుందని, దీనికి సంబంధించి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు అందులో పేర్కొన్నారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 మే 22న, 2025 జూన్ 11న సమర్పించిన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ అంశంపై కాన్సెప్ట్ నోట్, వివరణలను పంపాలని కోరినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ వ్యయ విభాగ ప్రతిపాదనను పరిశీలించిన తరువాత సీపీడబ్ల్యూడీ చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావ తిలో కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) నిర్మా ణ ప్రతిపాదనకు ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ప్రాజెక్ట్ అంచ నా వ్యయాన్ని పీఐబీ సమావేశంలో అంచనా వేస్తా రని పేర్కొన్నా రు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు రూ. 2,787 కోట్లతో నిర్మించనున్నారు. రూ. 1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం, అదేవిధంగా రూ. 1,458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టనుంది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్లకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్లో తెలిపారు.
అమరావతిలో రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
- Advertisement -
- Advertisement -