నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు… ఇలా ప్రతీదీ డిజిటల్గా మారిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్టేనని తెలిపారు. గూగుల్ అనేది ఇన్నోవేటివ్ కంపెనీ అయితే.. తమది ఇన్నోవేటివ్ (వినూత్న) ప్రభుత్వమని చెప్పారు. ఆ సంస్థ మాదిరిగానే తమ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను(జీఎస్ఇసీ) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిజిటల్ భద్రతే లక్ష్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ ఏర్పాటు చేసిన మొదటి జీఎస్ఇసీని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలో ఐదోది కావడం విశేషమన్నారు. ఈ కేంద్రం ఉపాధిని సృష్టించటంతోపాటు దేశ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ సంస్థ ఆవిర్భావంతో ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తామని సీఎం ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని మహిళలు ధనిక, పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని, ఆ మేరకు వారు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తున్నారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆవిష్కరణలు, విధానాలు రూపొందించామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారబోతోందని చెప్పారు. 2035 నాటికి ఒక ట్రిలియ న్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారనుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థ లు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే అది కచ్చితంగా తెలంగాణ నే అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ… ఎథికల్ ఇన్నోవేషన్లో ఇతర రాష్ట్రాల కు తెలంగాణ టార్చ్ బేరర్గా దిశా నిర్దేశం చేస్తుందని అన్నారు. 2024-25లో హైదరాబాద్ నుంచి రూ.2.68 లక్షల విలువైన ఐటీ, ఐటీ ఆధారిత సేవలు ఎగుమతి అయ్యాయని గుర్తు చేశారు. తద్వారా 40 వేల మందికి కొత్తగా ఉద్యోగా లు లభించాయన్నారు. అంతర్జాతీయ టాప్ 10 టెక్ దిగ్గజ కంపెనీల్లో ఏడు సంస్థలు హైదరాబాద్ నుంచే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.
మన జీవితాలన్నీ డిజిటల్మయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES