- Advertisement -
– వికారాబాద్లో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్
డాక్టర్ కారులో గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ భీమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీ చౌరస్తాలో రాత్రి 9.30 గంటలకు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయివేటు ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ప్రదీప్గౌడ్ ఫార్చునర్ వాహనంలో 65 గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
- Advertisement -