Thursday, June 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడు నెలల్లో అమలు చేయకపోతే జైలుకే

మూడు నెలల్లో అమలు చేయకపోతే జైలుకే

- Advertisement -

– ఇద్దరు అధికారులపై హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మూసీ సుందరీకరణ, అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారంగా స్థలాన్ని కేటాయించి రిజిస్ట్రేషన్‌ చేయని ఇద్దరు అధికారులకు హైకోర్టు షరతులతో కూడిన జైలు శిక్ష విధించింది. సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా యజమానికి మూడు నెలల్లో ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగించాలని తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోతే రెండు వారాల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలంది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం జైలు శిక్ష గడపాలని పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ కార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా చేసినఅరవింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏలో భూసేకరణ అధికారి ప్రసూనాంబలను ఆదేశిస్తూ జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు చెప్పారు
2016లో కేటాయించిన 666.67 చదరపు గజాల ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్‌ భగాయత్‌లో మూసీ సుందరీకరణకు చేపట్టిన 99.13 ఎకరాల భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 1,000 చదరపు గజాలు డెవలప్‌ చేసిన ప్లాటును కేటాయిస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిందనీ, దీని ప్రకారం భూమిని కోల్పోయిన పిటిషనర్‌కు రాంరెడ్డికి కేటాయించిన 666 చదరపు గజాలున్న ప్లాటు నెం.181కు కేటాయించి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వలేదంటూ కోర్టుకు వచ్చారు. కోర్టు ఆదేశించినా అమలు కాకపోవడంతో 2020లో మళ్లీ హైకోర్టుకు వస్తే, 2023 ప్రారంభంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు నెలల్లో ప్లాటు రిజిస్టర్‌ చేయాలన్న ఆ ఉత్తర్వులు కూడా అమలు కాకపోవడంతో రాంరెడ్డి కోర్టు ధిక్కారణ పిటిషన్‌ వేశారు. ఇందులో మున్సిపల్‌ శాఖ కౌంటర్‌ వేసింది. పిటిషనర్‌కు కేటాయించి ప్లాటు 181 సర్వే నెం.454లో ఉందని, దీనికి సంబంధించి మరో వ్యక్తి హైకోర్టు నుంచి స్టే పొందారని చెప్పింది. దీంతో రిజిస్ట్రేషన్‌ చేయించలేకపోయామనీ, కావాలని కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని తెలిపింది. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌ రెండోసారి హైకోర్టును ఆశ్రయించినపుడు హైకోర్టు స్టే ఉత్తర్వుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయగా అదే విధంగా 2024 జనవరిలో మరోసారి హామీ ఇచ్చి ఏడాది దాటినా స్టే ఎత్తివేయాలని గానీ, అప్పీలు వేయడం గానీ చేయలేదన్నారు. మూడు నెలల్లో ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేసివ్వకపోతే ప్రతివాదులైన పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీయే కమిషనర్‌గా పనిచేసిన అరవింద్‌కుమార్‌, భూసేకరణ అధికారి ప్రసూనాంబలకు రెండు వారాల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో వారం జైలు శిక్ష అమలు అవుతుందన్నారు.
యజమానికి కుక్కను అప్పగించండి : జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం
పోలీసుల సూచన మేరకు స్వాధీనంలోకి తీసుకున్న కుక్కను యజమానికి అప్పగించాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. వ్యక్తులపై దాడి చేస్తోందన్న ఫిర్యాదు మేరకు పోలీసుల ఆదేశాలతో కుక్కను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పట్టుకెళ్లడంపై చిక్కడపల్లికి చెందిన ఇ.బి.దక్షిణామూర్తి పిటిషన్‌ వేశారు. నోటీసు ఇవ్వకుండా కుక్కను తీసుకెళ్లారనీ, కుక్క పెంపకానికి లైసెన్స్‌ కూడా ఉందనీ, దానికి వైద్యం చేయాల్సి ఉందనీ, కోతుల బోనులో ఉంచారని పిటిషనర్‌ వాదన. దీనిపై ప్రభుత్వం, డ్యూగో అర్జెంటీనా అనే కుక్క బ్రీడ్‌పై నిషేధం ఉందనీ, పిటిషనర్‌ సోదరుడు నరసింహమూర్తి ఫిర్యాదుతోనే జీహెచ్‌ఎంసీకి లేఖ రాసిన తర్వాత దానిని తీసుకువెళ్లారని చెప్పింది. కుక్కను యజమానికి అప్పగిం చాలంటూ జీహెచ్‌ఎంసీకి ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. కుక్కను మనుషులు ఉన్నచోట వదిలిపెట్టరాదని పిటిషనర్‌ను ఆదేశించింది.
రెండో ఎఫ్‌ఐఆర్‌లో సాక్షిగానే చూడండి : శ్యామల కేసులో హైకోర్టు
బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించి యాంకర్‌, వైసీపీ నేత శ్యామలపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు ఉన్నందున అదే వ్యవహారంపై సైబర్‌ క్రైం పోలీసులు మరో కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని శ్యామల సవాల్‌ చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ విచారించారు. మొదటి ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే కేసు దర్యాప్తు చేయాలన్నారు. రెండో ఎఫ్‌ఐఆర్‌లోని శ్యామలను కేవలం సాక్షిగానే పరిగణించాలని ఆదేశించారు. దర్యాప్తునకు సహకరించాలని శ్యామలను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -