– సెన్సెక్స్ 139 పాయింట్ల తగ్గుదల
ముంబయి: పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధం దలాల్ స్ట్రీట్ను రెండో రోజూ కలవరానికి గురి చేసింది. బుధవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు లేదా 0.17 శాతం పతనమై 81,445కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 41 పాయింట్ల నష్టంతో 24,812 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అధిక నష్టాలను చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి.
స్మాల్ క్యాప్ స్టాక్స్ ఐదు రెట్ల వృద్ధి : బజాజ్ ఫిన్సర్వ్
గడిచిన ఏడేండ్లలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఐదు రెట్ల వృద్ధిని నమోదు చేశాయని బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ పేర్కొంది. 2017 నుంచి 2024 మధ్య ప్రతీ ఏడాది సగటున 27.6 శాతం చొప్పున రాబడిని అందించాయని పేర్కొంది. 2017లో మార్కెట్ క్యాపిటలజైషన్ రూ.17 లక్షల కోట్లుగా ఉండగా.. 2024 ముగింపు నాటికి రూ.92 లక్షల కోట్లకు చేరిందని బజాజ్ ఫిన్ సర్వ్ వెల్లడించింది.
మార్కెట్లలో యుద్ధ కలవరం
- Advertisement -
- Advertisement -