Thursday, June 19, 2025
E-PAPER
Homeక్రైమ్కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆందోళన సృష్టించింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉంటున్న 27 ఏళ్ల సుష్మ అనే మహిళ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది . నిన్న హైటెక్ సిటీలోని ఓ కార్యాలయంలో పని కోసం వచ్చిన ఆమె, రాత్రి సమయంలో ఇంటికి చేరుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెంది ఆఫిస్ మేనేజర్‌ను సంప్రదించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, సుష్మ రాత్రి 10:30 గంటలకు కార్యాలయం నుంచి బయలుదేరింది.

సుష్మ ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన అంజయ్య ఉదయం నాలుగు గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది సుష్మదిగా గుర్తించారు. ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పోలీసులు, ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాలని దర్యాప్తు మొదలుపెట్టారు. సంఘటన ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు, వివరాల కోసం సాక్షులను ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -