Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు విశాఖకు ప్రధాని మోడీ..

నేడు విశాఖకు ప్రధాని మోడీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ ఖరారైంది. ఇవాళ విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. రేపు జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవం లో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకుంటారని అధికారిక ప్రకటన వెలువబడింది.
ఈ నేపథ్యం లో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు సాయంత్రం ఐదున్నర గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. ఇక రేపటి రోజు న ఉదయం 6 గంటల 25 నిమిషాలకు యోగానంద 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రికార్డు స్థాయిలో 5 లక్షల మంది… ఒకే చో ట యోగాసనాలు చేసేలా ప్లాన్ చేశారు. వైజాగ్ బీచ్ లోనే ఈ యోగా కొనసాగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -