Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి బుధారపు శ్రీనివాస్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్స్ కంచెర్ల ప్రభాకర్, బొజ్జ సురేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 24 న జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని ఎంఈవో తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు రాజలింగం, కవిరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -