నఖిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏఓ సందీప్

నవతెలంగాణ – పెద్దవూర
నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయశాఖ అధికారి సందీప్ అన్నారు. శనివారం మండలం పలు పర్టీలజర్స్ షాపులు, విత్తన విక్రయ కేంద్రాలను పరిశీలించారు.ఈసందర్బంగా మాట్లాడుతూ..గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను విక్రయించాలని తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయించిన రైతులకు బిల్లులు ఇవ్వాలని తెలిపారు.పత్తి  విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని తెలిపారు.రైతులు కూడా విత్తనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి దుకాణాదారు నుంచి రశీదు తీసుకోవాలన్నారు.  మంచి నాణ్యతా ప్రమాణాలు ఉన్న పాకెట్లలో ఉన్న ప్రత్తి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.లూసు విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మహేశ్వరీ, ఆంజనేయులు, మధుకర్, రాము, సీతార  ఉన్నారు.
Spread the love