నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ల విందుపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ తన ప్రయోజనాలను పొందే వరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, అలాగే, తనను తాను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తుందన్నారు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన క్వశ్చన్ కు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం అనుకుంటున్నాం.. ట్రంప్ మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది మరో విషయం.. యూఎస్ తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నాడు. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని కనీసం పట్టించుకోదని ఆరోపించాడు.
ట్రంప్-అసిఫ్ మునీర్ విందుపై జమ్ము సీఎం కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES