Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఇల్ల నిర్మాణాలను ప్రారంభించుకొని ప్రస్తుతం రూమ్ లెవెల్ కు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేశారు. రూమ్ లెవెల్ కి వచ్చిన ఇండ్ల బిల్లు త్వరలోనే లబ్ధిదారులకు  అందుతుందని తెలిపారు. బిల్లు రాగానే స్లాబ్ పనులను ప్రారంభించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. మిగతా ఇళ్ల లబ్ధిదారులు కూడా తమ ఇంటి పనులను త్వర త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇసుక కోసం పంచాయతీ కార్యదర్శి ద్వారా తాసిల్దార్ కు దరఖాస్తు చేసుకుంటే వేబిల్ ఇస్తారని తెలిపారు.ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -