Sunday, June 22, 2025
E-PAPER
Homeఖమ్మంకేరళ తరహా అభివృద్దే ధ్యేయం..

కేరళ తరహా అభివృద్దే ధ్యేయం..

- Advertisement -

విద్యా వైద్యం మౌళిక సదుపాయాల కే ప్రాధాన్యం….
మారుమూల ప్రాంతాలకు ప్రజారవాణా సౌకర్యం….
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: విద్యా వైద్యం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యతను ఇస్తూ,మారుమూల ప్రాంతాలకు సైతం ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తూ అశ్వారావుపేట నియోజక వర్గంలో కేరళ తరహా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. శనివారం ఆయన మండలంలోని జమ్మి గూడెం,మద్ది కొండ,అచ్యుతాపురం,నారావారి గూడెం,అశ్వారావుపేట,వేదాంత పురం,వినాయక పురం,నారాయణపురం,కోయ రంగాపురం పంచాయితీల్లో రూ.2 కోట్ల 29 లక్షల 30 వేల వ్యయంతో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ లు,పాఠశాల మరుగుదొడ్లు,ప్రహరీలు,అంగన్వాడి భవనాలు,అధునాతన హంగులతో నిర్మించిన శివ పంచనామా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేని కాలంలో నా దృష్టికి వచ్చిన సామాజిక అవసరాలు,అధికారంలోకి వచ్చాక వచ్చిన వినతులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం చేస్తున్నాను అని అన్నారు.

నియోజక వర్గం కాక మునుపు నుండి అశ్వారావుపేట లో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నా నేటికీ సరైన వసతులు లేక,కనీసం శవ పంచనామా గది సైతం లేదని,నేడు రూ.24 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో మార్చురీ గదిని నిర్మించామని,100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని,త్వరలో నర్సింగ్ కళాశాలను తీసుకొస్తానని అన్నారు.

అటవీ ప్రాంతంలోని మారు మూల గిరిజన పంచాయితీ అయిన కావడి గుండ్ల కు ప్రజా రవాణా సౌకర్యం లో భాగంగా ఈ నెల 23 న ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తూ అందులో నేను ప్రయాణం చేస్తానని అన్నారు.మరో మారుమూల పంచాయితీ అయిన కోయ రంగాపురం పంచాయితీ గుంటిమడుగు గిరిజన గ్రామంలో కేరళ తరహాలో అంగన్వాడీ భవనం నిర్మిస్తున్నాం అని అన్నారు. స్వయంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,మిండ హరి క్రిష్ణ,తగరం ముత్తయ్య,కొనకళ్ళ చెన్నారావు,కొల్లు చంద్రశేఖర్,కాసాని మురళి,పద్మ శేఖర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -