అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయండి : వరంగల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-కాశిబుగ్గ
అమెరికా అండదండలతో పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేసి శాంతి నెలకొల్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. వరంగల్ నగరంలోని సీపీఐ(ఎం) కార్యాల యంలో శనివారం జిల్లా కార్యదర్శి సిహెచ్. రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఇరాన్పై దాడి చేసి పసి పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా చంపేస్తూ ఉన్మాదంతో వ్యవహరిస్తోందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతోందని, దాని ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పహ ల్గాం ఉగ్రవాదులను పట్టుకునేలా అంతర్జాతీయంగా ఒత్తిడి చేయాలని, ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు. మావోయిస్టులను అణచేస్తామని ప్రకటించి ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, మావోయిస్టులను దారుణంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలన్నారు. కార్మికుల శ్రమను దోపి డీ చేసే విధంగా పనిగంటలు పెంచుతూ యజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థ లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, జిల్లా కమిటీ నాయకులు సింగారపు బాబు, నలిగటి రత్నమాల, ఇసంపల్లి బాబు, భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, బొల్ల సాంబయ్య, శ్రీధర్, మధుకర్, యారా ప్రశాంత్, వనదాసు దుర్గయ్య ఉన్నారు.
యుద్ధాన్ని విరమించి శాంతి నెలకొల్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES