- Advertisement -
ముంబయి : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ (ఎంటీబీ) కొత్తగా తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్సీవీ) విభాగంలో అత్యధిక మైలేజీని అందించే మహీంద్రా ఫ్యూరయో 8ను విడుదల చేసినట్లు ప్రకటించింది. 6 టైర్ల ఈ వేరియంట్ 7 అడుగులలో లోడింగ్ ఏరియా కలిగి ఉటుందని వెల్లడించింది. వినియోగదారులకు ప్రయోజనాలను చేకూర్చడంలో కొత్త ప్రమాణాలను సృష్టించే విధంగా ఈ కొత్త ట్రక్ సిరీస్ను రూపొందించామని మహీంద్రా గ్రూపు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు వినోద్ సహారు పేర్కొన్నారు.
- Advertisement -