Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయండీఎన్‌ఏ నమూనాలు సరిపోలడం లేదు..

డీఎన్‌ఏ నమూనాలు సరిపోలడం లేదు..

- Advertisement -

– బాధిత కుటుంబాల్లో వేదన
– 231 మృతదేహాల గుర్తింపు..
అహ్మదాబాద్‌:
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 231 మృతదేహాలను గుర్తించగా.. మరికొందరి డీఎన్‌ఏ నమూనాలు సరిపోలడం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా రక్త సంబంధీకుల నమూనాలు ఇవ్వాలని ఎనిమిది కుటుంబాలకు సూచించినట్లు తెలిపారు. డీఎన్‌ఏ సరిపోలితేనే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేయడం, పదిరోజులు గడిచినా తమవారి మ ృతదేహాలు ఇంకా అందకపోవడంతో కొన్ని కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
”సాధారణంగా తండ్రి లేదా కుమారుడు/కుమార్తె నమూనాలు తీసుకుంటాం. డీఎన్‌ఏతో సరిపోలని పక్షంలో మరో బంధువు/రక్త సంబంధీకుల నమూనాలు ఇవ్వాలని అడుగుతాం. గతంలో ఒక తోబుట్టువు నమూనా ఇచ్చినట్లయితే, ఇప్పుడు మరొకరి డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని బాధిత కుటుంబాలను అడుగుతున్నాం. చాలా కేసుల్లో తోబుట్టువుల నమూనాలు సరిపోలుతున్నాయి” అని అహ్మదాబాద్‌ ప్రభుత్వాస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే, ఎనిమిది కుటుంబాల నమూనాలు సరిపోలలేదని, దీంతో మరొకరి నమూనాలను ఇవ్వాలని కోరామన్నారు.
231 మృతదేహాల గుర్తింపు..
విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష ఒక్కటే మార్గమని పేర్కొన్న అధికారులు శుక్రవారం నాటికి 231 మ ృతదేహాలను గుర్తించామన్నారు. వీటిలో 210 మ ృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేసినట్టు తెలిపారు. డీఎన్‌ఏ సరిపోల్చే ప్రక్రియ అత్యంత సున్నితమైందని, వీటిలో చట్టపరమైన అంశాలు ఇమిడి ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని, బాధిత కుటుంబాలకు మ ృతదేహాలు అందించేందుకు అన్ని విభాగాలు తీవ్ర క ృషి చేస్తున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -