నవతెలంగాణ-హైదరాబాద్ : స్నేహం పేరుతో ఓ బాలిక(16)తో మాటలు కలిపిన ఓ బాలుడు(16).. ఆమెను బెదిరించి నగ్న వీడియోలను రికార్డు చేసి ఇతరులకు పంపిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదైంది. ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సామాజిక మాధ్యమం ద్వారా ఓ బాలుడు దగ్గరయ్యాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలని.. లేదంటే చాటింగ్ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వీడియోను రికార్డు చేసిన బాలుడు తన స్నేహితులకు షేర్ చేశాడు.
ఇలా బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఎనిమిది మందిపై గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. షీటీం బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు సీఐ రాజు ఆధ్వర్యంలో బాలుడు(16), మరో బాలుడు(15), వంశీకృష్ణ(20), పవర్ తరుణ్(18), సాబ్లె బాలవంత్ సింగ్(18), గుండల్వార్ వరుణ్(18), కారడ్ సుధీర్(28), ముర్కుటే విఠల్(23)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. ఇద్దరు బాలురను నిజామాబాద్లోని జువైనల్ హోంకు, మిగిలిన వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.