నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లంగొడ, సూర్యాపేట, MHBD, వరంగల్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది.