![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240618-WA0006.jpg)
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అతికం అంజా గౌడ్ ( 53) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబీకులు అనాధలుగా మారారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఆటో కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.