– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం ప్రభుత్వం చేపట్టనున్న జన గణన, కుల గణనలో ఆదివాసీలకు ‘ప్రత్యేక మతం’ అనే కాలవమ్ను కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానిం చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మిడియం బాబురావు, పూసం సచిన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీల సంస్కృతి, భాష, వైవిధ్య భరితమైన జీవన విధానాలకు సంబంధించి ఆదివాసీలకు ప్రత్యేక మతం గుర్తింపును గెజిట్లో పొందు పర్చాలని కోరారు. ఆదివాసీల అనేక సంవత్సరాలనుండి జన గణనలో ప్రత్యేక మత కాలమ్ కేటాయించాలని పోరాడు తున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరో షెడ్యూల్లలో ఆదివాసీల నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాల రక్షణ కోసం రాజ్యాంగం లో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఆర్టికల్ 371ఎ, 371 బి లకు అదనం గా నాగాలాండ్, అస్సాంలలో చట్టాలు, ఆచారాలకు నిర్దిష్ట రక్షణలున్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ (25) విశ్వాసాన్ని ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పిస్తుందని తెలిపారు. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించే హక్కును ఇస్తుందని గుర్తు చేశారు. ఈ హక్కులు జనాభా లెక్కలతో సహా ప్రతి సాధారణ చట్టపరమైన విధాన పరిధిలో ప్రకృతి ఆరాధన, పూర్వీకుల సంప్రదాయాలపై కేంద్రీకృతమై ఉన్న విభిన్న విశ్వాస-ఆధారిత నమ్మకాల గుర్తింపుగా ఆదివాసీలు కలిగి ఉన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వాలు పైన ఆరు మతాలకు మాత్రమే కాలమ్స్ కేటాయించడంతో ఆదివాసీల గుర్తింపునకు ప్రత్యామ్నాయం లేక స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. 2027 జనాభా గణనలో ప్రత్యేక కాలామ్ కేటాయించి ఆదివాసీలకు ప్రత్యేక కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగు చేస్తున్న ఆదివాసీలు, గిరిజనేతర పేదలపై దాడులను ఆపాలని ఈ సందర్భంగా బాబురావు, సచిన్ డిమాండ్ చేశారు. పోడు పట్టాలకు బ్యాంకు నుండి రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏలను బలోపేతం చేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు.
జనాభా లెక్కల్లో ఆదివాసీలకు ‘ప్రత్యేక మతం’ కాలమ్ కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES