- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత మాజీ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు మంగళవారం రాష్ట్రపతి భవన్లో ‘పద్మ శ్రీ’ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి విడతలో హాజరు కాలేకపోయిన రోహిత్, ఈసారి హాజరై పురస్కారాన్ని స్వీకరించారు. భారత క్రికెట్కు ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం లభించింది. అవార్డు అందుకునే సమయంలో ఆయన నలుపు రంగు సూట్లో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన భార్య రితికా సచ్దేహ్ ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -



