Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇంటికి 40 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉచితం

ఇంటికి 40 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉచితం

- Advertisement -

– లక్షకుపైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌ : గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక ఇంటి కోసం 40 మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందనీ,ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్దిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో 2.37 లక్షల లబ్దిదారులకు మంజూరు పత్రాలను కూడా అందజేశామని తెలిపారు. 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్‌ అయ్యాయనీ, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉందన్నారు. ఈ నెల 23 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇండ్లను మంజూరు చేయడం, గ్రౌండింగ్‌ చేయడంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వికారాబాద్‌, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగు పడాలని సూచించారు. తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న పనులపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -