– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీఆర్ఎస్ సర్కారు
– ఇందుకు బాధ్యులైనవారిని ఎవరినీ వదలద్దు : రాష్ట్ర ప్రభుత్వానికి ఈటల డిమాండ్
– సిట్ ముందు సాక్ష్యమిచ్చిన బీజేపీ ఎంపీ
– బీజేపీ నాయకుడు ప్రేమేందర్రెడ్డి, టీడీపీ నేత కిషోర్ వాంగ్మూలాలు నమోదు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ఫోన్ట్యాపింగ్లకు పాల్పడి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేసిందనీ, ఇందుకు బాధ్యులైనవారు ఏ ఒక్కరిని కూడా వదలకుండా చట్టపరంగా శిక్షింపజేయాలని ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ అధికారుల ముందు హాజరై రాజేందర్ వాంగ్మూలమిచ్చారు. అనంతరం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… విపక్షాలకు చెందిన నాయకులతో పాటు కార్యకర్తలు, జడ్జిలు, వ్యాపారవేత్తలతో పాటు సొంత పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయటం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచే తనతో పాటు తన కుటుంబసభ్యులు, తన సన్నిహిత నాయకులు, అభిమానులకు చెందిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని అన్నారు. చివరకి తన భార్య నిర్వహించే జమునా హేచరీస్లో పని చేసేవారితో పాటు తన భార్య జమునా, తాను మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను కూడా ట్యాప్ చేశారనీ, ఇది అత్యంత హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం నాలుగువేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసి రాజకీయ లబ్దిని పొందారని ఈటల అన్నారు. బీజేపీ నాయకులు, పార్లమెంటు సభ్యులతో పాటు గవర్నర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయటం ద్వారా తమ దుష్ట చింతనను అప్పటి సర్కారు బయట పెట్టుకున్నదని తెలిపారు. ఐజీ ప్రభాకర్రావు వంటి నీచమైన అధికారి తాను (ప్రభాకర్రావు) కొన్ని ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాలని చెప్తే.. తన కింది అధికారులైన ప్రణీత్రావు, ఇతరులు అనేక ఫోన్లను ట్యాపింగ్ చేశారని సిట్కు తెలపటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని అన్నారు.
ఫోన్ట్యాపింగ్లకు పాల్పడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES