- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు తంజావూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. మరోవైపు ఉదయనిధి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -


