Thursday, June 26, 2025
E-PAPER
Homeజాతీయంనయా దోస్తానా

నయా దోస్తానా

- Advertisement -

ఇంధన విక్రయాల్లో అంబానీ- అదానీల మధ్య కీలక ఒప్పందం
న్యూఢిల్లీ :
దేశంలోనే అతిపెద్ద కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీ కలిసికట్టుగా ఓ వ్యాపారం చేయాలని నిర్ణయించారు. పెట్రోల్‌, డీజిల్‌తో పాటుగా గ్యాస్‌ వంటి ఇంధనాలు ఒకే చోట విక్రయించ డానికి వీలుగా జియో బీపీ, అదానీ గ్రూప్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎంపిక చేసిన బంకుల్లో రెండు సంస్థలు పరస్పర ఇంధన విక్రయాలు చేపట్టనున్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌కు చెందిన ఔట్‌లెట్లలో ఇక నుంచి జియో బీపీకి చెందిన పెట్రోల్‌, డీజిల్‌ ఇంధనలను విక్రయించనున్నారు. జియో-బీపీ బంకుల్లో ఎటీజీఎల్‌ సీఎన్‌జీ లభించనుంది.
ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం వినియోగదారులకు తాము అందించే సేవలు మరింత విస్తృతం కానుందని జియో బీజేపీ చైర్మెన్‌ సార్థక్‌ బెహురియా తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం అందించడమే తమ ఉమ్మడి లక్ష్యమని ఎటీజీఎల్‌ సీఈఓ సరేష్‌ పి మంగ్లానీ పేర్కొన్నారు. ఎటీజీఎల్‌కు దేశంలో 650 పైగా సిఎన్‌జి స్టేషన్లు ఉన్నాయి. జియో బీపీకి 2,000 పైగా బంకులు ఉన్నాయి. ఇకపై వీటిలో ఇరు సంస్థల ఉత్పత్తులు పరస్పరం లభించనున్నాయి. కాగా.. ఇది భారత వ్యాపార సామ్రాజ్యంలో అత్యంత కీలక ఒప్పందంగా నిలిచిపోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -