Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంఅంతరిక్ష కేంద్రంతో ఆక్సియం-4 అనుసంధానం

అంతరిక్ష కేంద్రంతో ఆక్సియం-4 అనుసంధానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కి చేరుకున్నారు. ఆక్సియం -4 మిషన్‌లో భాగంగా శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌ గురువారం సాయంత్రం ఐఎస్‌ఎస్‌తో డాక్‌ చేయబడింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సేంటర్‌ నుండి 424 కి.మీ ఎత్తులో ఉన్న కేంద్రానికి 28 గంటల ప్రయాణం పూర్తయింది.

డాకింగ్‌ అనేది క్రూ క్యాప్సూల్‌ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానించే విధానం. ఇది చాలా కీలకం. డాకింగ్‌ ప్రారంభించే ముందు క్రూ క్యాప్సూల్‌ మొదట అంతరిక్ష కేంద్రంతో కలవాల్సి వుంది. అవి రెండూ ఒకే కక్షలో ఉండాలి, అలాగే ఒకదానికొకటి దగ్గరగా ఉండాల్సి వుంది. ఇందుకోసం క్రూ క్యాప్సూల్‌, అంతరిక్ష కేంద్రాల మధ్య స్థానం, వేగం మరియు దిశను సరిపోల్చడం ద్వారా కచ్చితమైన స్థానికీకరణ తో పాటు సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టాల్సి వుంటుంది.

గురువారం సాయంత్రం 4.30గంటలకు (భారత కాలమానం ప్రకారం) మిషన్‌ కంట్రోల్‌ ‘సాఫ్ట్‌ క్యాప్చర్‌’ను నిర్థారించింది. అంటే అంతరిక్ష నౌక (క్రూ క్యాప్సూల్‌), అంతరిక్ష కేంద్రాన్ని తాకే సమయంలో ఉత్పత్తి అయ్యే గతిశక్తిని కొంత స్థలాన్ని అనుమతించే కనెక్షన్‌, నిమిషాల తర్వాత హార్డ్‌ క్యాప్చర్‌ అంటే మరింత బలవమైన కనెక్షన్‌ నిర్థారించబడింది.

అయితే శుక్లాతో పాటు డ్రాగన్‌ క్యాప్సూల్‌లోని ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోని మిగిలిన ఏడుగురు వ్యోమగాములను వెంటనే చేరుకోరు. స్టేషన్‌తో కనెక్షన్‌ను స్థిరం చేసేందుకు, సీల్‌లో ఎటువంటి విచ్ఛిన్నం జరగకుండా లేదా వ్యోమగాముల భద్రతకు హాని కలిగించే లింక్‌తో ఏదైనా సమస్య లేదని నిర్థారించుకునేందుకు మరి కొంత సమయం పడుతుంది. ఐఎస్‌ఎస్‌, డ్రాగన్‌ క్యాప్సూల్‌ను వేరుచేసే హాచ్‌ సాయంత్రం 6.10 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తెరుచుకుంటుంది. అనంతరం వారు ఐఎస్‌ఎస్‌లో 14 రోజుల పాటు ఉండాల్సి వుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -