Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లపై పోరాడుదాం..!

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లపై పోరాడుదాం..!

- Advertisement -
  • జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
  • సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ 
  • నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
    • కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికలకు వ్యతిరేకంగా  నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం  హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ మేనేజర్ సంపత్ రావుకు, మండల పరిషత్ కార్యాలయంలో ఏం పీడీవో వేణుగోపాల్ రెడ్డి కి సమ్మె నోటీసులు వేరువేరుగా  అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గానికి  నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా జులై 9వ న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. 2021లో బిజెపి ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకి అనుకూలంగా ఈ చట్టాలను రూపొందించాలని, వీటి ఫలితంగా కార్మిక వర్గం ఆధునిక బానిసలుగా మారాల్సి వస్తుందని తెలిపారు.
    • ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పని గంటలు పెంచి కనీస వేతనం రోజుకు రూ.175 రూపాయలు నెలకి రూ.47 25 చొప్పున ఒక కార్మికుడికి వేతనం ఇచ్చే పరిస్థితి అమలవుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితి దేశమంతా ఉంటే కార్మిక వర్గం రేపు రాబోయే కాలంలో పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే కనీస వేతనాలు అమలు కాక కార్మిక వర్గం అలమటిస్తుందన్నారు. లేబర్ కోడ్ అమలు కారణంగా మినిమం వేజ్ కోడ్ బిల్లు ద్వారా రాబోయే కాలంలో వేతనాల ను తగ్గిస్తుందన్నారు. సామాజిక భద్రత విషయంలో కూడా ప్రతి కార్మికుడి పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత గ్రాడ్యుటి లాంటి అంశాలలో తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు.  కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టుగా ఉన్న ఈ లేబర్ కోడ్ లను రద్దు పరచేత వరకు ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు జరుగుతున్న కార్మిక వర్గ రాజకీయ సమ్మెను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమ్మె నోటిస్ ఇచ్చిన వారిలో మెప్మా ఆర్పి యూనియన్ నాయకులు పద్మ ,సరిత,  పద్మ ,శోభ ,సరళ ,మున్సిపల్ యూనియన్ నాయకులు సారయ్య ,ప్రభాకర్ ,సతీష్ గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు సంపత్ మహేందర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -