Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి.. ప్రజాస్వామ్యంపై చేసినట్లే 

జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి.. ప్రజాస్వామ్యంపై చేసినట్లే 

- Advertisement -

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి 
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ డిమాండ్
నవతెలంగాణ – తాడ్వాయి 
: ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం పైన దాడి అని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నార్లాపూర్ ఆయన స్వగ్రామంలో శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించి జరిగిన సంఘటన విషయాల గురించి తెలుసుకున్నారు. ఏది ఏమైనా ఆంధ్రజ్యోతి విలేఖరి పై దాడి బాధాకరం అన్నారు.

ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజ బిక్షపతి గౌడ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు రథసారథులు అయిన జర్నలిస్టులపై దాడి చేయడం సిగ్గుచేటు అని ముంజాల అన్నారు. నిరుపేదల బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న విలేఖరి శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం పద్ధతి కాదని ఆయన అన్నారు.

 ప్రశ్నించే గొంతుకను మూసివేయాలని అనుకోవడం అవివేకానికి నిదర్శనం అని ముంజాల అన్నారు. పత్రికకు స్వేచ్ఛ లేదా వాస్తవాలు రాయకూడదా పత్రికలు ఏం చెప్తున్నాయి అర్హులైన నిరుపేదలైన బీదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడుగుతున్నాయి ? దానికి  మీరు భౌతికంగా దాడి చేయడం ఎంతవరకు న్యాయం అని అన్నారు. 

ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి కానీ రౌడీషీటర్లా ప్రవర్తించకూడదు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాదండి దేవేందర్, ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు దొనికెల లత, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు పావురాల బిక్షపతి, గుట్ట మీది ముసలయ్య, ఆలయ ప్రచార కార్యదర్శి గుండమీది వెంకటేశ్వర్లు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -