నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడతగా శనివారం నుంచి జులై 7 వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. జులై 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. జులై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. జులై 18లోపు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు.
జులై 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టి.. 26 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. 30లోపు రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జులై 31 నుంచి ఆగస్టు 2 లోపు విద్యార్థులు రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు.
అనంతరం ఆగస్టు 5 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 5న స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించి..6న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం.. 6, 7 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం