నవతెలంగాణ – మల్హర్ రావు : మండల పరిధిలోని ఇప్పలపల్లి కాంగ్రెస్ గ్రామశాఖను నేడు ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనలు, డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాలతో మండలంలోని ఇప్పలపల్లి గ్రామ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడుగా అబ్బివేన లింగుస్వామిని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా మాజీ జెడ్పిటిసి, కాంరెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ తెలిపారు. ఉపాధ్యక్షుడుగా బొమ్మన సత్తిరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా అక్కల దేవేందర్, కార్యదర్శిగా గౌరీ చెట్టి నవీన్,కోశాధికారిగా పెనుగొండ మహేష్, సలహా దారులుగా పోషంపెల్లి కత్తెరశాల, పోశం పల్లి వెంక్కన్న, అధికార ప్రతినిధిగా బొల్లం సమ్మయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, కాంగ్రెస్ నాయకులు కావటి రమేష్, కొడారి చినమల్లయ్య, శనిగల శ్రావణ్, మాజీ ఎంపీటీసీ నాగరాని లక్ష్మీ నారాయణ, రాజేశ్వర్ రావు, అక్కల రాము, బత్తుల సంపత్, బండారి శంకరయ్య, కుంభం ముకుంద రెడ్డి పాల్గొన్నారు.
ఇప్పలపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES