నవతెలంగాణ-హైదరాబాద్: ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (RAW) చీఫ్గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈనెల 30తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్గా పరాగ్ జైన్ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న పరాగ్ జైన్ రా చీఫ్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
కాగా, పరాగ్ జైన్.. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో హెడ్గా పనిచేస్తున్నారు. పాకిస్థాన్పై ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.