– జీడిమెట్ల పార్కులో ఆక్రమణల తొలగింపు
– పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డు పట్ల స్థానికుల హర్షం
నవతెలంగాణ-సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్
పార్కులో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన పార్కును కాపాడింది. 1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేశారు. ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం హైడ్రా కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఏవీ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కు ఫోన్ చేసి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలిసి హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. వెంటనే రాత్రికి రాత్రే పార్కు ప్రహరీ గోడ నిర్మించింది. శనివారం ఉదయం వేకువ జామునే పార్కులోకి వచ్చిన స్థానికులు.. పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును చూసి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలను అభినందించారు.
గంటల్లోనే హైడ్రా పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES