- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. వినాయక్నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఎంపీలు అర్వింద్, కె.లక్ష్మణ్ తదితరులున్నారు.
- Advertisement -