- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వనస్థలిపురం పనామ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తిపోట్లతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -


