- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులను మరో ఏడాది పొడగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న దాదాపు 16,448 మంది ఉద్యోగులను మరో ఏడాదికి పొడగించారు. వీరిలో 4,772 పోస్టుల కాంట్రాక్ట్ బేస్డ్, 8,615 ఔట్ సోర్సింగ్ విధానంలో, 3,056 పోస్టుల గౌరవ వేతన పద్ధతిలో, 5 పోస్టులు MTS ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా ప్రకటన జారీ చేశారు.
- Advertisement -